by సూర్య | Fri, Apr 26, 2024, 03:24 PM
గుడివాడ అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని.. ఇవే తనకు చివరి ఎన్నికలంటూ ఇటీవల ప్రకటించారు. అయితే కొడాలి నానికి గత ఎన్నికలే అంటే.. 2019 ఎన్నికలే చివరి ఎన్నికలు అవుతాయని టీడీపీ నేతలు శుక్రవారం స్పష్టం చేశారు. ఈ ఎన్నికల వేళ.. కొడాలి నాని నామినేషన్ పత్రాలు సమర్పించారు. అందులో ఆయన తప్పుడు సమాచారం పొందు పరిచారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై రిటర్నింగ్ అధికారికి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. కొడాలి నాని.. మున్సిపల్ కార్యాలయాన్ని క్యాంపు కార్యాలయంగా వినియోగించారంటూ ఆ ఫిర్యాదులో వారు స్పష్టం చేశారు. భవనాన్ని అద్దెకిచ్చిన్నట్లు అధికారులు పేర్కొన్న పత్రాలను ఈ పిర్యాదు పత్రానికి టీడీపీ నేతలు జత చేశారు. నామినేషన్ పత్రాల్లో తప్పుడు సమాచారం ఇచ్చిన కొడాలి నాని నామినేషన్ తిరస్కరించాలని రిటర్నింగ్ అధికారికి వారు ఈ సందర్భంగా విజ్జప్తి చేశారు.
Latest News