పీయూష్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం

by సూర్య | Fri, Apr 26, 2024, 03:23 PM

వైసీపీ ప్రభుత్వంపై కేంద్రమంత్రి పీయూష్ గోయిల్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి బొత్సఅన్నారు. రైల్వే జోన్ కోసం 52 ఎకరాలు ఇచ్చామని.. ఒప్పందం జరిగిందని తెలిపారు. ‘‘మాది మాఫీయా ప్రభుత్వమా?.. చేతకాని దద్దమ్మలు మాపై విమర్శలు చేస్తున్నారు’’ అంటూ మండిపడ్డారు. ఎలక్ట్రోల్ బాండ్స్ అవినీతిని దేశం అంతా చూసిందని.. తమపై చౌకబారు విమర్శలు చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖ బదిలీల్లో అవినీతి జరిగిందని రోజూ వార్తలు రాస్తున్నారని.. దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరారు. పదవ తరగతి పరీక్షలలో ఒక ఆరోపణలు రాకుండా నిర్వహించామని.. .మంచి ఉత్తీర్ణత శాతం వచ్చిందన్నారు. సరైన సమాచారం లేకుండా విమర్శలు చేయడం సమజసం కాదని అన్నారు. 2014 నుంచి 2018 వరకు ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు ఉందని.. అప్పుడు ఏం సాధించారని..అప్పుడు ఒక ఇంజన్‌కు రిపేర్ వచ్చిందా? అంటూ మంత్రి బొత్స సత్యానారాయణ ఎద్దేవా చేశారు.

Latest News

 
ప్రభాస్ మద్దతు ఆ పార్టీకే.. ప్రచారం కూడా చేస్తున్న కృష్ణంరాజు సతీమణి Wed, May 08, 2024, 10:16 PM
ఒంటరిగా కారులో మహిళ.. 5 నిమిషాల్లోనే పని ముగించిన ఇద్దరు దుండగులు Wed, May 08, 2024, 09:05 PM
ఏపీలో మరికొందరు పోలీసులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు Wed, May 08, 2024, 09:00 PM
చిత్తూరు జిల్లా కుప్పంలో ఆసక్తికర సన్నివేశం,,,పోస్టల్ బ్యాలట్ ఓటర్ల కాళ్లపై పడ్డ వైసీపీ నేతలు Wed, May 08, 2024, 08:56 PM
గద్దె రామ్మోహన్‌రావుపై సంచలన ఆరోపణలు..ఎన్నికలకు ముందు కుట్ర Wed, May 08, 2024, 08:52 PM