by సూర్య | Fri, Apr 26, 2024, 02:13 PM
ప్రభుత్వ న్యాయ సలహాదారు జూపూడి ప్రభాకర్రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేద వర్గాలు, పెత్తందార్ల మధ్య, ప్రోగ్రెసివ్, ఫ్యూడలిజం మధ్య, భూస్వామ్య వర్గాలు, పేదల పక్షాన నిలబడే వారి మధ్యే ప్రస్తుతం పోటీ జరుగుతోందన్నారు. ప్రజలు ఎవరి పక్షాన నిలబడాలో ఆలోచించుకుని ఓట్లు వేయాలని కోరారు. పిఠాపురంలో వైయస్ఆర్సీపీ అభ్యర్థి వంగా గీత చేతిలో పవన్ ఓడిపోతున్నారని చెప్పారు. పార్టీ పెట్టి మూసేసిన చిరంజీవిని పవన్ ఎన్నికల ప్రచారానికి తెచ్చుకుని ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంపీ బీద మస్తాన్రావు, ఆదాల ప్రభాకర్రెడ్డి, కందుకూరు ఎమ్మెల్యే అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ పాల్గొన్నారు.
Latest News