రాష్ట్రానికి పట్టిన కేన్సర్‌ జగన్‌

by సూర్య | Thu, Apr 25, 2024, 06:51 PM

వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలూ ఇబ్బందులు పడ్డారు. కుటుంబ ఖర్చులకు తగ్గ ఆదాయం పెరగలేదు. పైగా.. రూ.10 ఇచ్చి తెలివిగా రూ.100 నొక్కేస్తున్నాడు సీఎం జగన్‌. రాష్ట్రానికి పట్టిన కేన్సర్‌ జలగ జగన్‌. శ్రీకాకుళం జిల్లాకు పట్టిన కేన్సర్‌ ధర్మాన ప్రసాదరావు. ఆయన ఇంటిపేరులో ధర్మం ఉంది.. కానీ ఆయన పనులన్నీ అధర్మమే. అధర్మానను ఇంటికి పంపించాలి. శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడును, ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్‌ను ఆశీర్వదించి గెలిపించాలి. ఎర్రన్న స్ఫూర్తిని కొనసాగిస్తూ.. రామ్మోహన్‌నాయుడు ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డగా, అసాధారణ వ్యక్తిగా ఎదిగాడు. ఆయన ఢిల్లీలో గళం విప్పితే తిరుగులేదు. నాకు డౌట్‌లేదు. ఎన్నిక లాంఛనమే. మంచి మెజార్టీతో ఆశీర్వదించాలి. గొండు శంకర్‌ ఓ సాధారణ కార్యకర్త. యువకుడు. మీ అందరి అభిప్రాయాలను అడిగాను. ఈ రోజు ఉదయం గుండ లక్ష్మీదేవి, సూర్యనారాయణతో మాట్లాడాను. వారు కూడా చాన్నాళ్లపాటు పార్టీకి సేవలందించారు. ఎన్ని ఇబ్బందులున్నా గెలుపే నిర్ణయంగా తీసుకున్నాను. మీ నోట్లో నాలుకగా తయారైన వ్యక్తి కావాలన్నదే శంకర్‌ను తయారుచేశాను. మీరు ఆదరించి గెలిపించాలి అని చంద్రబాబు కోరారు.

Latest News

 
ఒంటరిగా కారులో మహిళ.. 5 నిమిషాల్లోనే పని ముగించిన ఇద్దరు దుండగులు Wed, May 08, 2024, 09:05 PM
ఏపీలో మరికొందరు పోలీసులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు Wed, May 08, 2024, 09:00 PM
చిత్తూరు జిల్లా కుప్పంలో ఆసక్తికర సన్నివేశం,,,పోస్టల్ బ్యాలట్ ఓటర్ల కాళ్లపై పడ్డ వైసీపీ నేతలు Wed, May 08, 2024, 08:56 PM
గద్దె రామ్మోహన్‌రావుపై సంచలన ఆరోపణలు..ఎన్నికలకు ముందు కుట్ర Wed, May 08, 2024, 08:52 PM
ఈ నెల 11న కడపలో పర్యటించనున్న రాహుల్ Wed, May 08, 2024, 08:28 PM