|
|
byసూర్య | Sat, Mar 14, 2026, 09:07 PM
మహిళలు అన్ని రంగాల్లో రాణించి రాజకీయ, ఆర్థిక శక్తిగా ఎదగాలని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సూచించారు. గంగాధర మండలం బూరుగుపల్లి గ్రామ స్వశక్తి సంఘం మహిళలు శనివారం ఎమ్మెల్యేను గంగాధర ప్రజా కార్యాలయంలో కలిశారు. గ్రామంలో అదనపు స్వశక్తి సంఘం భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని వారు కోరారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే, భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని మహిళలకు హామీ ఇచ్చారు. వారి అభ్యర్థన మేరకు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యేకు మహిళలు కృతజ్ఞతలు తెలిపారు.