|
|
byసూర్య | Tue, Mar 10, 2026, 12:01 PM
దేశంలో చమురు, గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నాయని కేంద్రం చెబుతున్నప్పటికీ పలు నగరాల్లో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత ఆందోళన కలిగిస్తోంది. ముంబాయ్లో కమర్షియల్ LPG సిలిండర్ల కొరతతో సుమారు 20 శాతం హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయని హోటల్ అసోసియేషన్ తెలిపింది. పరిస్థితి కొనసాగితే మరికొన్ని రోజుల్లో సగం హోటళ్లు కూడా మూసివేయాల్సి వస్తుందని హెచ్చరించింది. అలాగే ఢిల్లీ, బెంగళూరుతో పాటు హైదరాబాద్లో కూడా కొన్ని రెస్టారెంట్లు గ్యాస్ లేక తాత్కాలికంగా మూసివేస్తున్నారు.