|
|
byసూర్య | Wed, Jan 14, 2026, 02:10 PM
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న గృహజ్యోతి పథకం లబ్ధిదారులకు సంక్రాంతి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు పత్రాలను అందజేస్తోంది. కామారెడ్డి జిల్లా, జుక్కల్ పరిధిలోని పిట్లం మండలం రాంపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ గుంట అనిత-హన్మాన్లు, ఉప సర్పంచ్ మందడి శ్రీధర్ రెడ్డి, విద్యుత్ సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారులకు ఈ పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పేదలకు గృహజ్యోతి పథకం ఒక వరం అని సర్పంచ్ అనిత-హన్మాన్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.