|
|
byసూర్య | Wed, Dec 17, 2025, 12:04 PM
హైదరాబాద్లోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయల్ కాలనీలో ముర్షీద్ అనే యువకుడిని దుండగులు కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించి, కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.