|
|
byసూర్య | Wed, Dec 17, 2025, 10:42 AM
తెలుగు రాష్ట్రాలు తీవ్రమైన చలితో వణికిపోతున్నాయి. తెలంగాణలో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయి. గత పదేళ్ల రికార్డులను బద్దలు కొడుతున్నాయి. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదయ్యాయి. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల వల్ల ఈ పరిస్థితి నెలకొందని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే రెండు రోజులు చలి ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. అతిశీతల గాలులు, పొగమంచు పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది