|
|
byసూర్య | Wed, Dec 17, 2025, 10:28 AM
లార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గానగర్ లో బుధవారం తెల్లవారుజామున కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో మధ్యప్రదేశ్ కు చెందిన ప్రభు మహారాజ్, సాధు నాథ్, దీపక్ (25) లు స్వెటర్లు విక్రయిస్తున్న షెడ్డులోకి అతివేగంగా దూసుకువెళ్లిన ఇన్నోవా కారు కారణంగా ఒకరు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కాటేదాన్ నుంచి దుర్గానగర్ వైపు వస్తున్న కారు అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగింది.