|
|
byసూర్య | Wed, Nov 12, 2025, 08:12 PM
ఢిల్లీలో బాంబు పేలుడు ఘటన మరవకముందే, దేశంలోని ఐదు ప్రధాన విమానాశ్రయాలను పేల్చేస్తామని బెదిరింపు ఈమెయిల్ రావడం కలకలం రేపింది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, త్రివేండ్రం విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకుని ఇండిగో కార్యాలయానికి ఈమెయిల్ అందింది. దీంతో అన్ని విమానాశ్రయాల్లో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో ఈమెయిల్ అందినట్లు పోలీసులు తెలిపారు.