|
|
byసూర్య | Wed, Nov 12, 2025, 08:03 PM
హైదరాబాద్ బోయిన్పల్లి సంచారపురి కాలనీలో నిన్న రాత్రి సయ్యద్ జునైద్ అనే వ్యక్తిపై అతని బంధువులైన సోహైల్, అతిహ్, రఫీక్ ఖాద్రి కత్తులతో దాడికి పాల్పడ్డారు. వాళ్ళ అక్కని వేధించడం వల్లే ఈ దాడి చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. తీవ్ర గాయాలైన జునైద్ను ఆసుపత్రికి తరలించారు. తనపై వరకట్న వేధింపుల కేసు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని జునైద్ ఆరోపించారు.ఈ ఘటనపై బోయిన్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.