|
|
byసూర్య | Fri, Oct 17, 2025, 03:24 PM
దశాబ్దాలుగా ఆస్పత్రుల్లో పనిచేస్తున్న కార్మికులకు జీఓ నంబర్ 60 ప్రకారం జీతాలు చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోట రామాంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సత్తుపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో కార్మికులకు ఏఐటీయూసీ సభ్యత్వాన్ని అందించి ఆయన మాట్లాడారు. కార్మికుల పక్షాన తాము అండగా ఉంటామని తోట రామాంజనేయులు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు రామకృష్ణ, కార్మికులు పాల్గొన్నారు.