|
|
byసూర్య | Fri, Oct 10, 2025, 10:22 AM
తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. చెల్లికి బిర్యానీ తీసుకురావడానికి వెళ్లిన అన్న నీరటి అభిలాశ్(19) అనే యువకుడు మృతి చెందాడు. బుధవారం రాత్రి 9 గంటల అప్పుడు బిర్యానీ తీసుకోని తిరిగి వస్తుండగా ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయమై స్పాట్లోనే మృతి చెందాడు. డీసీఎం ఎలాంటి సిగ్నల్ వేయకుండా రోడ్డుపై నిలపడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు.