|
|
byసూర్య | Mon, Oct 06, 2025, 01:47 PM
తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు జీవోపై సోమవారం SCలో విచారణ జరిగింది. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను తిరస్కరించింది. హైకోర్టులో విచారణలో ఉండగా ఇక్కడకు ఎందుకు వచ్చారని ప్రశ్నించింది. హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్కు సూచించింది. కాగా ఈ జీవో పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285కు విరుద్ధమని గోపాల్రెడ్డి అనే వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.