పార్టీ నిర్ణయాలను వ్యతిరేకించడం వల్లే తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేశామన్న మహేశ్ గౌడ్

byసూర్య | Wed, Sep 17, 2025, 08:27 PM

తెలంగాణ విలీనంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏమీ లేదంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో స్పందించారు. కవితకు చరిత్రపై అవగాహన లేదంటూ ఆయన విమర్శించారు. "అసలు కవిత ఎప్పుడు పుట్టారు? ఆమెకు చరిత్ర తెలుసా?" అంటూ సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ విలీన దినోత్సవానికి, కవితకు ఏం సంబంధమని ఆయన నిలదీశారు. చారిత్రక వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే మంచిదని హితవు పలికారు.ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అంశంపై కూడా మహేశ్ గౌడ్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలను వ్యతిరేకించినందువల్లే తీన్మార్ మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సి వచ్చిందని ఆయన వివరించారు. అయినప్పటికీ, బీసీల హక్కుల కోసం పోరాడే నాయకుడిగా మల్లన్నను తాను గౌరవిస్తానని అన్నారు. రాజకీయాల్లో ఎవరు పార్టీలు పెట్టినా స్వాగతిస్తామని, మల్లన్న కొత్త పార్టీ నిర్ణయాన్ని కూడా ఆహ్వానిస్తున్నామని మహేశ్ గౌడ్ పేర్కొన్నారు. ఇదే సందర్భంగా పార్టీ అంతర్గత వ్యవహారాలపైనా ఆయన స్పందించారు. కోమటిరెడ్డి సోదరులు తమ అభిప్రాయాలను బాహాటంగానే వెల్లడిస్తారని, కాంగ్రెస్ పార్టీలో ఆ మేరకు స్వేచ్ఛ ఉందని తెలిపారు. అయితే, ఆ స్వేచ్ఛను అలుసుగా తీసుకుని ఎవరైనా 'రెడ్ లైన్' దాటితే మాత్రం ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టంగా హెచ్చరించారు. పార్టీ క్రమశిక్షణను అతిక్రమించే చర్యలను సహించబోమని తేల్చిచెప్పారు.


Latest News
 

కుల వర్గ వ్యవస్థ నిర్ములన కోసం పోరాడిన వీరుడు పూలే Sat, Apr 11, 2026, 03:29 PM
శంకుస్థాపనలో ప్రోటోకాల్ వివాదం Sat, Apr 11, 2026, 02:37 PM
రేపటి నుంచి 10 రోజుల పాటు తెలంగాణలో తీవ్ర వడగాల్పులు Sat, Apr 11, 2026, 02:35 PM
సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమీక్ష సమావేశం Sat, Apr 11, 2026, 01:56 PM
ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ చేతుల మీదుగా గ్రాండ్ గా "ఐ క్యాబ్స్" ట్రాన్స్ పోర్ట్ సర్వీసెస్ ప్రారంభం Sat, Apr 11, 2026, 01:44 PM