|
|
byసూర్య | Fri, Sep 12, 2025, 11:15 AM
మెదక్ మండలం కొంటూరు పెద్ద చెరువు అలుగు మళ్ళీ ఓవర్ఫ్లో అవ్వడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అలుగు పారుతోంది. పక్షం రోజుల క్రితం కురిసిన వర్షాలతో రాయిన్పల్లి ప్రాజెక్ట్ నుండి వరద వచ్చి కోంటూరు చెరువు నిండి అలుగు పారడంతో వారం రోజుల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. వర్షంతో అలుగు పారుతుండటంతో ప్రజలు అటువైపు వెళ్లకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.