|
|
byసూర్య | Fri, Sep 12, 2025, 10:30 AM
ఎగువన కురిసిన భారీ వర్షాల కారణంగా హిమాయత్సాగర్కు వరద పోటెత్తింది. దీంతో అధికారులు ప్రాజెక్టు రెండు గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తివేశారు. ఫలితంగా రాజేంద్రనగర్ ఫుటేజ్ సర్వీస్రోడ్డుపై నీరు ప్రవహించడంతో రహదారిని రెండువైపులా మూసివేశారు. వాహనదారులు ఆ మార్గంలో ప్రయాణించవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.