|
|
byసూర్య | Fri, Sep 12, 2025, 10:28 AM
దేశీయ మార్కెట్ సూచీలు శుక్రవారం స్వల్ప లాభాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి. ఉదయం 10.10 గంటల సమయంలో సెన్సెక్స్ 229.14 పాయింట్ల లాభంతో 81777.87 వద్ద ఉండగా.. నిఫ్టీ 67.70 పాయింట్ల లాభంతో 25073.20 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సూచీలో హిందాల్కో, యాక్సిస్ బ్యాంక్, మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, ఓఎన్జీసీ షేర్లు లాభాల్లో.. టైటాన్ కంపెనీ, టెక్ మహీంద్రా, ఎస్బీఐ స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి.