|
|
byసూర్య | Mon, Sep 08, 2025, 03:13 PM
9వ వార్డు కాంగ్రెస్ నాయకులు లాడే బాలు మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా సొంత ఇంటి కోసం ఎదురుచూస్తున్న పేదల కలను కాంగ్రెస్ ప్రభుత్వం సాకారం చేసిందని తెలిపారు. పట్టణంలోని 9వ వార్డుకు చెందిన ఖలీల్ కు టీపీసీసీ వర్కింగ్ జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి ఆదేశాల మేరకు సోమవారం ఇందిరమ్మ ఇళ్ల పట్టాను లాడే బాలు అందజేశారు. ఇది పేదల ప్రభుత్వం, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి పేదవాడికి మద్దతుగా నిలుస్తామని లాడే బాలు స్పష్టం చేశారు.