|
|
byసూర్య | Mon, Sep 08, 2025, 03:03 PM
టేక్మాల్ మండల కేంద్రంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటల పెరుగుదల దశలో ఎరువులు అత్యవసరమని, ఈ కొరత తమను తీవ్రంగా నష్టపరుస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్య పరిష్కారం కోసం ఉమ్మడి మెదక్ జిల్లా నాయకులు భక్తుల వీరప్ప, టేక్మాల్ మండల నాయకులు సోమవారం స్థానిక సీఐను కలిసి, వెంటనే యూరియా సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేశారు.