|
|
byసూర్య | Sat, Jul 12, 2025, 12:43 PM
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట,రాయగిరిలోని అభయ అరణ్యంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా అభయారణ్యంలో ఉన్న పార్కును సందర్శించారు.అక్కడే ఉన్నటువంటి బండరాళ్లపై గీసిన చిత్రాలను పరిశీలించారు.అనంతరం వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు.ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరారు.