అమ్మాయి విషయంలో స్నేహితుల మధ్య గొడవ.. ఓ యువకుడు మృతి

byసూర్య | Wed, Jun 18, 2025, 02:09 PM

చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ అమ్మాయి విషయంలో స్నేహితుల మధ్య తలెత్తిన చిన్న పాటి గొడవ నేపథ్యంలో స్నేహితులు దాడి చేయడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి ప్రాథమిక సమాచారం మేరకు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే అమ్రేష్ ( 28) శామీర్ పేట్ లో ఒక పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్నాడు. ఓ అమ్మాయి విషయంలో స్నేహితుల మధ్య గత కొంత కాలంగా వివాదం కొనసాగుతుంది.మంగళవారం రాత్రి సమయంలో కళ్లు తాగేందుకు గాను నలుగురు స్నేహితులు కలిసి చందానగర్ లోని గిడ్డంగి కల్లు కాంపౌండ్ కు వచ్చారు. మహిళ విషయంలో స్నేహితుల మధ్య మరోసారి వివాదం చోటు చేసుకుంది. ఆగ్రహానికి గురైన మిత్రులు అమ్రేష్ పై పిడిగుద్దులు గుద్దడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


 


Latest News
 

అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్.. భారీ పద్దు.. అరకొర చర్చ! Mon, Mar 16, 2026, 08:30 PM
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అసెంబ్లీలోని బీజేఎల్పీ కార్యాలయానికి వెళ్లడం ఆసక్తిని రేకెత్తించింది Mon, Mar 16, 2026, 08:03 PM
విధుల పట్ల నిర్లక్ష్యం వద్దు: మండల ప్రత్యేక అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశం Mon, Mar 16, 2026, 07:56 PM
ఎస్సీ నిరుద్యోగులకు బంపర్ ఆఫర్: భారీ సబ్సిడీతో ఎలక్ట్రిక్ వాహనాల పంపిణీ! Mon, Mar 16, 2026, 07:51 PM
ఎస్సీ నిరుద్యోగులకు శుభవార్త: భారీ సబ్సిడీతో ఎలక్ట్రిక్ వాహనాలు – దరఖాస్తులు ప్రారంభం! Mon, Mar 16, 2026, 07:47 PM