ఇబ్రహీంపట్నంలో బిర్యానీలో బల్లి ఘటన.. యజమాని వివాదాస్పద వ్యాఖ్యలు

byసూర్య | Fri, May 16, 2025, 01:11 PM

ఇబ్రహీంపట్నం సాగర్ రహదారిపై ఉన్న మెహఫిల్ ఫ్యామిలీ రెస్టారెంట్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసిన కస్టమర్ గుజ్జా కృష్ణారెడ్డికి వడ్డించిన ప్లేటులో బల్లి కనిపించింది. ఈ విషయాన్ని రెస్టారెంట్ యజమానిని ప్రశ్నించగా, ఆయన “మంచిగా ఫ్రై అయింది, తినండి” అని వివాదాస్పద సమాధానం ఇచ్చాడు.
ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కృష్ణారెడ్డి, షేరిగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు రెస్టారెంట్ మేనేజర్‌ను స్టేషన్‌కు తరలించి విచారణ ప్రారంభించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రెస్టారెంట్‌లో ఆహార పరిశుభ్రతపై సీరియస్ ప్రశ్నలు లేవనెత్తింది. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Latest News
 

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు Sat, Apr 18, 2026, 03:48 PM
వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరానికి అనుగుణంగా మౌలిక వసతులను కల్పిస్తాం : ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ Sat, Apr 18, 2026, 02:38 PM
మున్సిపాలిటీల్లో ట్రేడ్ లైసెన్స్ అక్రమాలు! Sat, Apr 18, 2026, 02:35 PM
బ్రిటన్ పార్లమెంట్ లో.... మాజీ ఎంపీ సంతోష్ కుమార్ కు అరుదైన గౌరవం Sat, Apr 18, 2026, 12:30 PM
జనగణనకు సిద్ధం కావాలి: అదనపు కలెక్టర్ Sat, Apr 18, 2026, 12:16 PM