![]() |
![]() |
byసూర్య | Fri, May 16, 2025, 01:10 PM
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల చుట్టూ గందరగోళ పరిస్థితి నెలకొంది. మొదట దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలని అధికారులు సూచించగా, తర్వాత మాన్యువల్గా ఇవ్వాలని పేర్కొన్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీ వార్డు కార్యాలయాల్లో దరఖాస్తులు, అవసరమైన పత్రాలు సమర్పించిన అభ్యర్థులకు, తహసీల్దార్ కార్యాలయం నుంచి మరోసారి దరఖాస్తులు సమర్పించాలని ఫోన్ ద్వారా సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అస్పష్టతతో దరఖాస్తుదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
అధికారుల నుంచి స్పష్టమైన సమాచారం, సమన్వయం లేకపోవడంతో అభ్యర్థులు గుర్తించిన సమస్యలపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.