4 ఎకరాలపైబడిన వారికి ‘రైతుభరోసా’ నిధులు

byసూర్య | Wed, May 14, 2025, 07:35 PM

తెలంగాణలోని రేవంత్ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. అన్నదాతలు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తోన్న రైతు భరోసాకు సంబంధించి రేవంత్ సర్కార్ కీలక ప్రకటన చేసింది. నాలుగెకరాలు, ఆపై భూమి ఉన్న రైతులకు ఇంకా రైతు భరోసా అందలేదు. నిధులు ఎప్పుడు విడుదలవుతాయో తెలియక.. అన్నదాతలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్ సర్కార్ వారికి శుభవార్త చెప్పింది. రబీ సీజన్‌కు సంబంధించి నాలుగు నుంచి 10 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు మే చివరి వారంలోగా రైతు భరోసా నిధులు మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.


ఇందుకు అవసరమైన నిధులను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్ది ఆర్థిక శాఖను ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వచ్చేవారంలో రైతు భరోసాపై ముఖ్యమంత్రి రేవంత్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. అనంతరం రైతు భరోసా చెల్లింపుల ప్రక్రియపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


ఇక రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26వ తేదీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రబీ సీజన్‌కు సంబంధించి రైతు భరోసా కార్యక్రమాన్ని అమలు చేసింది. మొదటి దశలో భాగంగా రైతుల అకౌంట్లలోకి నిధులను జమ చేశారు. రెండో దశలో ఫిబ్రవరి 5న, మూడో దశలో ఫిబ్రవరి 11న రైతు భరోసా నిధులు విడుదల చేశారు. మొదటి మూడు దశల్లో.. నాలుగు ఎకరాల వరకు భూమి కలిగిన రైతుల ఖాతాల్లో మాత్రమే డబ్బులు జమ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. నాలుగెకరాలు ఆపై ఉన్న వారికి రైతు భరోసా నిధులు ఇంకా అందలేదు.


ఈ క్రమంలో వారందరికి రైతు భరోసా నిధులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. అయితే, వీటిని కూడా దశలవారీగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం.ఇప్పటి వరకు నాలుగెకరాలలోపు రైతులందరికి రైతు భరోసా నిధులు జమయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో నాలుగు ఎకరాలకిపైగా భూమి కలిగిన రైతులు దాదాపు 35లక్షల మంది ఉన్నారు. రబీ సీజన్‌కు సంబంధించిన వారంతా రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. మే చివరి నాటికి వారి ఖాతాల్లో ఈ నిధులు జమ చేయనున్నట్లు తెలుస్తోంది.


ఇక ఈ ఏడాదికి సంబంధించి.. ఖరీఫ్ సీజన్ జూన్లో ప్రారంభంకానుంది. ఈ క్రమంలో ప్రభుత్వం.. జూన్ నెల వరకు రబీ సీజన్‌కు సంబంధించిన చెల్లింపులు పూర్తి చేయాలని భావిస్తోంది. ఆ తరువాత జూలై నుంచి ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా నిధుల చెల్లింపు ప్రక్రియను ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ అంశంపై నిర్ణయం తీసుకునేందుకు త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.


Latest News
 

ఉద్యోగుల, ఉపాధ్యాయుల డిమాండ్లను పరిష్కరించాలి Fri, Apr 17, 2026, 02:45 PM
వీర్నపల్లిలో హిందూ సమ్మేళనం కరపత్రం ఆవిష్కరణ Fri, Apr 17, 2026, 01:49 PM
స్థానిక సమస్యలపై పాదయాత్ర… మాజీ కార్పొరేటర్ జగన్ Fri, Apr 17, 2026, 12:30 PM
తండ్రి మృతి తట్టుకోలేక కుమార్తె ఆత్మహత్య Fri, Apr 17, 2026, 12:09 PM
వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే ! Fri, Apr 17, 2026, 11:59 AM