ప్ర‌జావాణిలో అధికారికి ప్ర‌జ‌ల స‌త్కారం

byసూర్య | Tue, May 13, 2025, 10:50 AM

ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేసిన వెంట‌నే స్పందించి స‌మ‌స్య ప‌రిష్క‌రించిన‌ హైడ్రా అధికారిని.. అదే ప్ర‌జావాణిలో ప్ర‌జ‌లు స‌త్క‌రించారు. మిఠాయి తినిపించి.. క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్‌గారి చేతుల మీదుగా ఇన్‌స్పెక్ట‌ర్ తిరుమ‌లేష్‌ను స‌న్మానించారు.  వేలాది మంది నివాసితుల‌కు మీ అధికారులు దారి చూపారంటూ హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్ గారితో సంతోషం పంచుకున్నారు.  రాజేంద్ర‌న‌గ‌ర్ మండ‌లం కాటేదాన్ ద‌గ్గ‌ర మ‌ధుబ‌న్ కాల‌నీకి అనుకుని ఉన్న ఇందిరాగాంధీ కో ఆప‌రేటివ్  హౌసింగ్ సొసైటీలో మొత్తం 800ల ప్లాట్లున్నాయి.  కాటేదాన్ నుంచి శ్రీ‌రాం కాల‌నీకి వెళ్లే ప్ర‌ధాన 60 అడుగుల ర‌హ‌దారిని క‌లిపే 20 అడుగుల ర‌హ‌దారికి అడ్డంగా నిర్మించిన గోడ‌ల‌ను ఈ నెల 6వ తేదీన హైడ్రా తొల‌గించింది. దీంతో ఇందిరాగాంధీ కోప‌రేటివ్ హౌసింగ్ సొసైటీతో పాటు శ్రీ‌రాంన‌గ‌ర్ కాల‌నీ వాళ్ల‌కు కూడా ద‌గ్గ‌ర దారి దొరికింద‌ని అక్క‌డి నివాసితులు సంతోషం వ్య‌క్తం చేశారు. లేదంటే 4 కిలోమీట‌ర్లు అద‌నంగా ప్ర‌యాణించాల్సి వ‌చ్చేద‌ని..చెబుతూ ఫిర్యాదు అందిన వెంట‌నే స‌మ‌స్య ప‌రిష్క‌రించిన హైడ్రా అధికారుల‌ను నివాసితులు అభినందించారు.


Latest News
 

54 ఏళ్ల తర్వాత వేముల వాడ రోడ్డు విస్తరణకు మోక్షం Tue, Jun 17, 2025, 09:30 PM
హైదరాబాద్ నుంచి ఆఫ్రికా ఖండానికి మొట్టమొదటిసారిగా నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి Tue, Jun 17, 2025, 08:35 PM
కలెక్టర్ వల్లూరు క్రాంతికి శుభాకాంక్షలు తెలిపిన ఖేఢ్ ఎమ్మెల్యే Tue, Jun 17, 2025, 08:27 PM
తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహణకు సర్వం సిద్ధమైంది Tue, Jun 17, 2025, 08:27 PM
గోశాలల అభివృద్ధి, నిర్వహణ విధానంపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష Tue, Jun 17, 2025, 08:25 PM