రేపు విజయవాడలో పర్యటించనున్న సీఎం రేవంత్

byసూర్య | Tue, Apr 29, 2025, 05:20 PM

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా కుమారుడి వివాహ వేడుకలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి బెజవాడకు వెళ్లనున్నారు. రేపు ఉదయం 9.15 గంటలకు రేవంత్ రెడ్డి బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరుతారు. ఉదయం 10.40 గంటలకు విజయవాడ సమీపంలోని కానూరులో ఉన్న ధనేకుల ఇంజనీరింగ్ కాలేజ్ ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన కల్యాణ మండపంలో ఉదయం 10.50 గంటల నుంచి 11.30 గంటల వరకు జరిగే వివాహ వేడుకలో పాల్గొని, నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. అనంతరం విజయవాడ నుంచి తిరుగుపయనమవుతారు. మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్ చేరుకుంటారు.గత వారం దేవినేని ఉమా హైదరాబాద్‌లో రేవంత్ రెడ్డిని కలిసి, తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. పెళ్లికి తప్పకుండా హాజరు కావాలని ఆయన సీఎంను ఆహ్వానించారు. గతంలో రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు దేవినేని ఉమాతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. పార్టీలు మారినప్పటికీ వారి మధ్య స్నేహ బంధం ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే మిత్రుడి ఆహ్వానం మేరకు రేవంత్ రెడ్డి ఈ వివాహానికి హాజరవుతున్నారు.


Latest News
 

ప్రాణహిత-గోదావరి లోయలో అద్భుతం.. లోయలో డైనోసార్ అవశేషాలు Fri, May 16, 2025, 07:46 PM
తెలంగాణకు ఆ స్కీం కింద రూ.1,487 కోట్లు,,,, కేంద్రం ప్రకటన Fri, May 16, 2025, 07:41 PM
పైసా ఖర్చు లేకుండా,,,,60 ఏళ్లు దాటిన వారికి వైద్యం Fri, May 16, 2025, 07:34 PM
బిర్యానీలో చచ్చిన బల్లి.. కస్టమర్ షాక్ Fri, May 16, 2025, 07:29 PM
కాంగ్రెస్ సర్కారు కమీషన్ సర్కారుగా మారిందన్న కేటీఆర్ Fri, May 16, 2025, 07:19 PM