![]() |
![]() |
byసూర్య | Tue, Apr 29, 2025, 03:47 PM
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కేసరిసముద్రం చెరువు మినీట్యాంక్ బండ్ జలాలపై మంగళవారం నీటి కాకుల సందోహం చూపరులకు ఇట్టే కనువిందు చేస్తున్నాయి. వందల సంఖ్యలో నీటి పక్షులు నీటి ఉపరితలంపై పక్షులు ఎగురుతూ లయబద్ధంగా విన్యాసాలు సైనిక కావాతును తలపిస్తున్నాయి.
అవి గుంపులు గుంపులుగా నేలపై వాలుతు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఈ పక్షుల దృశ్యాలు ప్రకృతి ప్రేమికులకు ఒక మధురమైన అనుభూతి కలిగిస్తున్నాయి.