విదేశాల్లో అదృశ్యమైన తెలంగాణ విద్యార్థి

byసూర్య | Tue, Apr 29, 2025, 03:31 PM

తెలంగాణ విద్యార్థి లండన్‌లో అదృశ్యమయ్యాడు. నిజామాబాద్ జిల్లా, ముప్కాల్ మండలం, రెంజర్ల గ్రామానికి చెందిన నల్ల అనురాగ్ రెడ్డి విద్యార్థి వీసాపై జనవరిలో లండన్‌కు వెళ్లాడు. ఈ నెల 25వ తేదీ సాయంత్రం నుంచి ఆయన కనిపించకుండా పోయాడు. కుమారుడు అదృశ్యం కావడంతో తల్లి హరిత, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.లండన్‌లో తప్పిపోయిన తన కుమారుడి ఆచూకి తెలుసుకొని ఇండియాకు రప్పించాలని కోరుతూ హరిత సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఖనిజాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అనిల్ ఈరవత్రికి వినతి పత్రాన్ని పంపారు. యూకేలోని కార్డిఫ్ ప్రాంతంలో ఈ నెల 25 సాయంత్రం నుంచి తన కుమారుడి జాడ తెలియకుండా పోయిందని హరిత తన వినతి పత్రంలో పేర్కొన్నారు.ఖనిజాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అనిల్ దీనిపై వెంటనే స్పందించారు. సీఎంఓ, జీఏడీ, ఎన్ఆర్ఐ అధికారులతో ఆయన మాట్లాడారు. దీంతో ఢిల్లీలోని విదేశాంగ శాఖకు, లండన్‌లోని ఇండియన్ హైకమిషన్‌కు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) లేఖ రాశారు. 


Latest News
 

తిరంగా ర్యాలీ సందర్భంగా రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు Fri, May 16, 2025, 08:18 PM
యాంటీ నార్కోటిక్స్ విభాగంలో మొదటి బహుమతిని అందుకున్న తెలంగాణ పోలీస్ Fri, May 16, 2025, 08:03 PM
ఎక్స్‌పీరియం ఎకో పార్క్ కు చేరుకున్న ప్రపంచ సుందరీమణులు Fri, May 16, 2025, 08:00 PM
దిశా సమావేశం: మెదక్ ఎంపీ Fri, May 16, 2025, 07:57 PM
ఎల్ఆర్ఎస్ రూల్స్‌కు సవరణలు.. మే 31 వరకే ఛాన్స్ Fri, May 16, 2025, 07:51 PM