![]() |
![]() |
byసూర్య | Wed, Apr 23, 2025, 10:30 AM
రైతులు తాము పండించిన వరి ధాన్యాన్ని ఆయా కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ అన్నారు. మంగళవారం జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూర్ గ్రామంలో నిర్వహిస్తోన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆరబోసిన ధాన్యం తేమ శాతం గురించి ఆరా తీసి, టార్పాలిన్లు, గన్ని సంచులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.