![]() |
![]() |
byసూర్య | Tue, Apr 22, 2025, 09:08 PM
BRS MLA పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. తన భర్తను బెదిరించి రూ.25 లక్షలు తీసుకున్నారని ఉమాదేవి అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరో రూ.50 లక్షలు ఇవ్వాలంటూ ఫోన్ చేసి బెదిరించారని ఫిర్యాదులో పేర్కొంది. డబ్బులు ఇవ్వకపోతే తన భర్తను, కుటుంబ సభ్యులను చంపుతానని ఎమ్మెల్యే బెదిరించినట్లు ఆరోపించింది. ఈ మేరకు సుబేదారి PSలో ఫిర్యాదు చేసింది. పోలీసులు 308(2), 308(4), 352 BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు