![]() |
![]() |
byసూర్య | Tue, Apr 22, 2025, 04:19 PM
వేసవి దృష్ట్యా జరిగే దొంగతనాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే అన్నారు. పోలీసు శాఖ వారి సూచనలు పాటించి దొంగతనాల నియంత్రణకు జిల్లా ప్రజలు సహకరించాలని కోరారు. అనుమానిత వ్యక్తుల కదలికలను గమనించి, పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. వేసవిలో పిల్లలకు సెలవులుండటంతో చాలా మంది ప్రయాణాలు చేస్తారు. ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారని పేర్కొన్నారు.