నేనెప్పుడూ ఆ పని చేయలేదు, ఇకపై.. హర్షసాయి

byసూర్య | Mon, Mar 17, 2025, 10:16 PM

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్‌ ప్రమోషన్ మీద, వాటిని ప్రమోట్ చేస్తున్న ఇన్‌ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్ల గురించి సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే నడుస్తోంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్లు, ఇన్‌ఫ్లూయెన్సర్లపై టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే.. సజ్జనార్ షేర్ చేసిన వీడియో ఆధారంగా చేసుకుని సైబరాబాద్ పోలీసులు యూట్యూబర్ హర్ష సాయి మీద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. హర్ష సాయి చేసిన ఓ పోస్టు చేయగా.. ఇప్పడిది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.


తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో హర్ష సాయి స్టోరీ పెట్టుకున్నాడు. "మేము ఎప్పుడూ చట్టవిరుద్ధమైన బెట్టింగ్ యాప్‌లకు సపోర్ట్ చేయలేదు. భవిష్యత్తులోనూ అలాంటి బెట్టింగ్ యాప్‌లకు వ్యతిరేకంగా మరింత కఠినంగా ఉంటాము. అందరం కలిసి ఇలాంటి మోసపూరిత యాప్‌ల మూల కారణాన్ని పరిష్కరించగలమని, పాజిటివ్ ఛేంజ్ కోసం పని చేయగలమని మా ఆశ." అంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ పెట్టుకున్నాడు. కాగా.. ఈ పోస్టు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.


ఆ తర్వాత.. ఓ వీడియోను కూడా విడుదల చేశాడు హర్ష సాయి. బెట్టింగ్ యాప్స్‌ వల్ల జరుగుతున్న నష్టాల గురించి అవగాహన కల్పిస్తున్న అధికారులు, యూట్యూబర్లకు హర్ష సాయి అభినందనలు తెలిపారు. తన వ్యూవర్స్‌కి గానీ, ఫాలోవర్స్‌కి గానీ నష్టం కలిగించే పనులు తాను ఎన్నడూ చేయనని చెప్పుకొచ్చారు. భవిష్యత్తులోనూ.. ఈ బెట్టింగ్ యాప్స్‌కి సంబంధించిన మూలాలను కనుక్కుని రూపుమాపేందుకు పోరాడదామని పిలుపునిస్తూ.. వీడియోలో హర్ష సాయి చెప్పుకొచ్చారు.


అయితే.. గతంలో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌కు సంబంధించి పలు వివాదాల్లో ఇరుక్కుని వార్తల్లో నిలిచాడు హర్ష సాయి. ఈ విషయంలో చాలా మంది హర్ష సాయిని వ్యతిరేకించారు కూడా. అయితే.. మిగతా యూట్యూబర్ల నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తుండటంతో.. హర్ష సాయి దీనిపై స్పందిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకపోతే.. వేరే ఎవరో ఒకరు చేస్తారని, తాను చేయటం వల్ల ఆ డ్యామేజీని కొంచెం తగ్గిస్తున్నానంటూ.. చెప్పుకొచ్చాడు. తాను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ మాత్రం చేస్తానని.. దాని వల్ల ఎలాంటి నష్టం గానీ, మోసం గానీ చేయట్లేదని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పటం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. ఆ వీడియోనే సజ్జనార్ తాజాగా ట్విట్టర్‌లో షేర్ చేసారు.


అయితే.. ఈ బెట్టింగ్ యాప్స్ రక్కసిపై సజ్జనార్ ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా తనదైన శైలిలో పోస్టులు చేస్తూ.. బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్‌‌‌ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. అమాయకులైన యువత ఈ బెట్టింగ్ యాప్‌ల వలలో చిక్కుకుని విలువైన జీవితాలు నాశనం చేసుకోకుండా ఉండేందుకు తనవంతుగా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తూనే.. ఇటూ ఆ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్లను వెలుగులోకి తీసుకొస్తున్నారు. దీంతో.. ఆయన వెలుగులోకి తీసుకొస్తున్న ప్రమోటర్లపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.


ఇప్పటికే వైజాగ్ లోకల్ బాయ్ నాని, భయ్యా సన్నీ యాదవ్‌ మీద పోలీసులు కేసులు నమోదు చేయగా.. లోకల్ బాయ్ నానిని ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్‌కు కూడా తరలించారు. ఇక.. భయ్యా సన్నీ యాదవ్‌ గురించి పోలీసుల వేట కొనసాగుతోంది. ఈ క్రమంలోనే.. యూట్యూబర్ హర్ష సాయిపై కూడా సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్స్‌ ప్రమోషన్ వివాదంలో గతంలో హర్ష సాయి ఓ యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పోస్టును పరిగణలోకి తీసుకున్న సైబరాబాద్ పోలీసులు.. కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో.. హర్ష సాయి కీలక పోస్టు చేయటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.


Latest News
 

రుణం చెల్లించలేని వారి వ్యక్తిగత సమాచారంతో బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని వెల్లడి Tue, Apr 22, 2025, 07:24 PM
ఫోఫ్ ఫ్రాన్సిస్ చిత్రపటానికి నివాళులర్పించిన పార్టీ శ్రేణులు Tue, Apr 22, 2025, 04:24 PM
వేసవి దృష్ట్యా జరిగే దొంగతనాలపై ప్రత్యేక దృష్టి: ఎస్పీ Tue, Apr 22, 2025, 04:19 PM
చలివేంద్రం ప్రారంభించిన రామగుండం ఎమ్మెల్యే Tue, Apr 22, 2025, 04:18 PM
ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో ఎంత మంది పాసయ్యారంటే? Tue, Apr 22, 2025, 04:16 PM