తెలంగాణ ప్ర‌జాప్ర‌తినిధుల సిఫార్సు లేఖ‌ల‌కు కూడా శ్రీవారి ద‌ర్శ‌నం

byసూర్య | Mon, Mar 17, 2025, 07:23 PM

తెలంగాణ ప్ర‌జాప్ర‌తినిధుల‌కు టీటీడీ శుభ‌వార్త‌ చెప్పింది. ఇక‌పై తెలంగాణ ప్ర‌జాప్ర‌తినిధుల సిఫార్సు లేఖ‌ల‌కు కూడా శ్రీవారి ద‌ర్శ‌నం క‌ల్పించాల‌ని టీటీడీ నిర్ణ‌యించింది. మార్చి 24వ తేదీ నుంచి తెలంగాణ సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనం కేటాయింపు ఉంటాయ‌ని టీటీడీ వెల్ల‌డించింది. కాగా, గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ ప్ర‌జాప్ర‌తినిధుల‌ను అప్పటి టీటీడీ పాలకులు, అధికారులు పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు, టీటీడీ ఛైర్మన్ బీఅర్ నాయుడు ప్రత్యేక చొరవతో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు స్వీకరించే విధానం అమలు కానుంది.సోమ, మంగళవారాల్లో తెలంగాణ సిఫార్సు లేఖపై వీఐపీ బ్రేక్ దర్శనం కేటాయింపు ఉంటుంది. అలాగే బుధ, గురువారాల్లో రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి అవ‌కాశం ఉంటుంది. ఒక ప్రజాప్రతినిధి తాలూకు ఒక సిఫార్సు లేఖపై ఆరుగురికి మించకుండా దర్శన అవ‌కాశం కేటాయించనుంది. ఏపీ ప్రజా ప్రతినిధులకు ఇకపై సోమవారం దర్శనానికి సిఫార్సు లేఖలు స్వీకరించబ‌డవు. దానికి బదులుగా ఆదివారం దర్శనం కోసం శనివారం నాడు టీటీడీ లేఖలు స్వీకరించనుంది. సుదీర్ఘంగా చర్చించి, అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ వెల్లడించింది. ఈ మార్పులను దృష్టిలో ఉంచుకొని సిబ్బందికి సహకరించాలని భక్తులను టీటీడీ కోరింది. 


Latest News
 

మే 10న ప్రారంభం కానున్న మిస్ వరల్డ్ పోటీలు అతిథులు, పోటీదారులకు అసౌకర్యం కలగకుండా చూడాలని సీఎం ఆదేశం Tue, Apr 29, 2025, 05:03 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఏపీలో పర్యటించనున్నారు Tue, Apr 29, 2025, 04:58 PM
దేశం పిలిస్తే ప్రాణాలు అర్పించేందుకు సిద్ధమన్న ఓ మాజీ సైనికుడి వ్యాఖ్యలను గుర్తు చేసిన మంత్రి Tue, Apr 29, 2025, 04:53 PM
కేసీఆర్ సభ విజయవంతం కావడానికి కాంగ్రెస్ కారణమన్న జగ్గారెడ్డి Tue, Apr 29, 2025, 04:50 PM
కను విందుగా పక్షుల సందడి Tue, Apr 29, 2025, 03:47 PM