తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్‌నగర్ ఎంపీ, బీజేపీ నేత డీకే అరుణకు ఫోన్ చేశారు

byసూర్య | Mon, Mar 17, 2025, 04:29 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్‌నగర్ ఎంపీ, బీజేపీ నేత డీకే అరుణకు ఫోన్ చేశారు. డీకే అరుణ నివాసంలోకి గుర్తుతెలియని వ్యక్తి చొరబడిన ఘటనపై మాట్లాడారు. ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి ఓ దుండగుడు చొరబడిన విషయం తెలిసిందే. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.ఇంట్లోకి ప్రవేశించిన ఆగంతుకుడిని గుర్తించేందుకు సీసీ ఫుటేజీని పరిశీలించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఎంపీ ఇంటికి చేరుకొని వివరాలను సేకరించారు. దుండగుడు ప్రవేశించిన ప్రాంతాలను పరిశీలించారు. డీకే అరుణకు కల్పించాల్సిన భద్రత పైనా డీసీపీ వివరాలు సేకరించారు.ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 56లోని ఎంపీ నివాసంలో ముసుగు ధరించిన ఆగంతుకుడు ఇంటి వెనుక నుంచి లోనికి ప్రవేశించాడు. సీసీ కెమెరా వైర్లను కత్తిరించి, దాదాపు గంట పాటు ఇంట్లో తిరిగాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు.డీకే అరుణ కూతురు ఉదయం నిద్ర లేచేసరికి ఇల్లంతా చిందరవందరగా ఉంది. వంట గది కిటికీ గ్రిల్ తొలగించడం గమనించారు. డీకే అరుణ డ్రైవర్ లక్ష్మణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ కెమెరాల్లో నమోదైన ఆధారాలతో నిందితుడిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.


Latest News
 

మిస్ వరల్డ్ - 2025 పోటీలపై సీఎం సమీక్ష సమావేశం Tue, Apr 29, 2025, 05:35 PM
రేపు 'లైట్స్ ఆఫ్' కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏఐఎంపీఎల్‌బీ Tue, Apr 29, 2025, 05:32 PM
దేశ భద్రతలో భాగంగా ప్రతి వ్యక్తి సైనికుడిలా ఉండాలి Tue, Apr 29, 2025, 05:30 PM
రేపు విజయవాడలో పర్యటించనున్న సీఎం రేవంత్ Tue, Apr 29, 2025, 05:20 PM
మే 10న ప్రారంభం కానున్న మిస్ వరల్డ్ పోటీలు అతిథులు, పోటీదారులకు అసౌకర్యం కలగకుండా చూడాలని సీఎం ఆదేశం Tue, Apr 29, 2025, 05:03 PM