అర్ధరాత్రి వేళ ప్రవేశించిన ఆగంతకుడు..బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లో కలకలం

byసూర్య | Sun, Mar 16, 2025, 05:50 PM

మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి.. ఆగంతకుడు ప్రవేశించాడు. జూబ్లీహిల్స్‌లోని డీకే అరుణ నివాసంలోకి శనివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తి ప్రవేశించాడు. ఇంట్లోని కిచెన్, హాల్ ఇలా పరిసర ప్రాంతాలన్నీ కలియతిరిగాడు. సీసీ కెమెరాలు ఆఫ్ చేసి, కిచెన్ విండో తొలగించి ఆగంతకుడు లోనికి ప్రవేశించినట్లు తెలిసింది. గంటకుపైగా ఇంట్లో కలియతిరిగినట్లు తెలిసింది. దీంతో కుటుంబసభ్యులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే డీకే అరుణకు ఈ విషయాన్ని చేరవేశారు. డీకే అరుణ అప్రమత్తమై వెంటనే ఈ విషయాన్ని సిబ్బందికి తెలియజేయగా.. సిబ్బంది జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. మరోవైపు ఆగంతకుడు ఇంట్లోకి చొరబడిన సమయంలో డీకే అరుణ అక్కడ లేనట్లు తెలిసింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.


Latest News
 

సంగారెడ్డి జిల్లాలో పరువు హత్య Thu, Dec 11, 2025, 10:38 AM
మంచినీటి ట్యాంకుపై గాలిపటాలు: పిల్లల భద్రతపై ఆందోళన Thu, Dec 11, 2025, 10:32 AM
కేంద్ర విత్తన చట్టం-2025: రైతు ప్రయోజనాలకు ప్రాధాన్యత - మంత్రి తుమ్మల Thu, Dec 11, 2025, 10:28 AM
మూడో విడత లోకల్ బాడీ ఎన్నికల్లో 394 సర్పంచ్ స్థానాలపై పూర్తి ఏకగ్రీవం Wed, Dec 10, 2025, 10:48 PM
ఏకంగా రూ.1000 కోట్లతో ఫండ్,,,గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి Wed, Dec 10, 2025, 09:48 PM