![]() |
![]() |
byసూర్య | Sat, Mar 15, 2025, 02:15 PM
తెలంగాణలో కూడా భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. శనివారం 8 జిల్లాల్లో 41 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యే చాన్స్ ఉంది.. ఈ మేరకు ఆదిలాబాద్, జగిత్యాల, కొమురం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఇక.. నిన్న కూడా ఆదిలాబాద్, నిజామాబాద్, భద్రాచలం, మహబూబ్నగర్, మెదక్, రామగుండంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని వెల్లడించింది. రెండు, మూడు రోజుల వరకు రెండు నుంచి నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.