వాతావరణ అప్ డేట్స్

byసూర్య | Fri, Mar 14, 2025, 05:17 PM

తెలంగాణలో ఉష్ణోగ్రతలు మార్చి నెలలోనే 40 డిగ్రీల పైకి చేరుకున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సాధారణం కంటే 3.3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయని వెల్లడించింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయని తెలిపింది. రానున్న రెండు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశముందని తెలిపింది. హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లో 39 డిగ్రీలు నమోదవుతున్నట్లు వెల్లడించింది.ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో ఎండ తీవ్రతతో పాటు వడగాలుల ప్రభావం అధికంగా ఉన్నట్లు పేర్కొంది. ఈ జిల్లాల్లో ఇప్పటికే ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపింది. శనివారం మరో ఏడు జిల్లాల్లోను 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని, ఈ జిల్లాలకూ ఎల్లో హెచ్చరికలు అమల్లోకి వస్తాయని తెలిపింది.


Latest News
 

ఒక్కో కుటుంబానికి రూ.14 వేలు బెనిఫిట్....కొత్త పథకాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి Mon, Jan 19, 2026, 09:36 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎమ్మెల్యే హరీశ్‌రావుకు నోటీసులు Mon, Jan 19, 2026, 09:32 PM
డబుల్ బెడ్రూం ఇండ్లలో ,,,,,అక్రమాలను వెలికితీసేందుకు ప్రభుత్వం వినూత్న సర్వే Mon, Jan 19, 2026, 09:10 PM
సిరిసిల్ల మెగా పవర్ లూమ్ క్లస్టర్ మంజూరులో జాప్యం చేస్తున్నారన్న కేటీఆర్ Mon, Jan 19, 2026, 07:52 PM
దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోంది: రేణుకా చౌదరి Mon, Jan 19, 2026, 07:30 PM