![]() |
![]() |
byసూర్య | Sun, Feb 16, 2025, 02:09 PM
ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అర్హులైన పేద, ప్రజలకు బలహీనవర్గాలైన మున్సిపల్ కార్మికులకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పాలబిందెల శ్రీనివాస్ అన్నారు. అనంతరం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎం.డీ షబ్బీర్ అలీ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పాలబిందెల శ్రీనివాస్ మాట్లాడుతూ ఏఐటీయూసీ బలహీన వర్గాల వైపు ఉంటుందని అన్నారు.
గతంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రకటించిన ఇందిరమ్మ ఇళ్లలో అనేక అవకతవకలు వున్నాయని, పేద ప్రజలకు కాకుండా భవంతులు వున్న వారికే మళ్లీ ఆ అవకాశం కల్పించాలని చూస్తున్నారని అన్నారు. పేద ప్రజల అపోహలు తొలగించి వెంటనే పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.