అర్హులైన పేద, ప్రజలకు మున్సిపల్ కార్మికులకు ఇందిరమ్మ, ఇళ్లులు ఇవ్వాలి

byసూర్య | Sun, Feb 16, 2025, 02:09 PM

ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అర్హులైన పేద, ప్రజలకు బలహీనవర్గాలైన మున్సిపల్ కార్మికులకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పాలబిందెల శ్రీనివాస్ అన్నారు. అనంతరం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎం.డీ షబ్బీర్ అలీ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పాలబిందెల శ్రీనివాస్ మాట్లాడుతూ ఏఐటీయూసీ బలహీన వర్గాల వైపు ఉంటుందని అన్నారు.
గతంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రకటించిన ఇందిరమ్మ ఇళ్లలో అనేక అవకతవకలు వున్నాయని, పేద ప్రజలకు కాకుండా భవంతులు వున్న వారికే మళ్లీ ఆ అవకాశం కల్పించాలని చూస్తున్నారని అన్నారు. పేద ప్రజల అపోహలు తొలగించి వెంటనే పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

కుల వర్గ వ్యవస్థ నిర్ములన కోసం పోరాడిన వీరుడు పూలే Sat, Apr 11, 2026, 03:29 PM
శంకుస్థాపనలో ప్రోటోకాల్ వివాదం Sat, Apr 11, 2026, 02:37 PM
రేపటి నుంచి 10 రోజుల పాటు తెలంగాణలో తీవ్ర వడగాల్పులు Sat, Apr 11, 2026, 02:35 PM
సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమీక్ష సమావేశం Sat, Apr 11, 2026, 01:56 PM
ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ చేతుల మీదుగా గ్రాండ్ గా "ఐ క్యాబ్స్" ట్రాన్స్ పోర్ట్ సర్వీసెస్ ప్రారంభం Sat, Apr 11, 2026, 01:44 PM