![]() |
![]() |
byసూర్య | Sun, Feb 16, 2025, 12:18 PM
మంచిర్యాలలో PDSU రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో పి.డి.ఎస్.యూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి14 నెలలు గడుస్తున్నా.. ఇప్పటివరకు విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని నియమించలేదని పీ డీ ఎస్ యు జిల్లా అధ్యక్షుడు సికిందర్ మండిపడ్డారు.
శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిరసన చేపట్టారు.గత మూడేళ్లుగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ బకాయి లను విడుదల చేయాలని కోరారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి. డి.ఎస్.యూ జిల్లా అధ్యక్షుడు పి సికిందర్, శ్రవణ్, సంతోష్, అనిల్, కళ్యాణ్, రమ్య, కావ్య,జ్యోతి తదితరులు పాల్గొన్నారు.