నేటి నుండి నాలుగు రోజులపాటు మేడారం మినీ జాతర

byసూర్య | Wed, Feb 12, 2025, 11:06 AM

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని వనదేవతలు సమ్మక్క సారలమ్మ మినీ జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది.  మహాజాతర నిర్వహించిన మరుసటి సంవత్సరం మినీ జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లను దర్శించుకునేందుకు భారీగా తరలివస్తున్నారు భక్తులు. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన జాతరలో సమ్మక్క- సారలమ్మ జాతర ఒకటి . ఆదివాసీ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన సమ్మక్క - సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు లక్షల సంఖ్యలో వస్తారు. అమ్మవార్లకు బెల్లాన్ని(బంగారాన్ని) సమర్పిస్తే తమ కష్టాలన్నీ తొలగిపోతాయని ప్రజల నమ్మకం.అమ్మవార్ల గద్దెల దగ్గర ఉన్న బెల్లాన్ని చిటికెడు తీసుకెళ్లినా చాలు.. ఆ బెల్లమే తల్లుల దీవెనగా భావిస్తారు. అందుకే అమ్మవార్లకు కిలోల కొద్దీ బంగారాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు భక్తులు.


 


 


Latest News
 

కుల వర్గ వ్యవస్థ నిర్ములన కోసం పోరాడిన వీరుడు పూలే Sat, Apr 11, 2026, 03:29 PM
శంకుస్థాపనలో ప్రోటోకాల్ వివాదం Sat, Apr 11, 2026, 02:37 PM
రేపటి నుంచి 10 రోజుల పాటు తెలంగాణలో తీవ్ర వడగాల్పులు Sat, Apr 11, 2026, 02:35 PM
సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమీక్ష సమావేశం Sat, Apr 11, 2026, 01:56 PM
ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ చేతుల మీదుగా గ్రాండ్ గా "ఐ క్యాబ్స్" ట్రాన్స్ పోర్ట్ సర్వీసెస్ ప్రారంభం Sat, Apr 11, 2026, 01:44 PM