హైదరాబాదులోని సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్ పై దాడి

byసూర్య | Sun, Feb 09, 2025, 05:45 PM

హైదరాబాదులోని సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్ పై దాడి జరిగింది. రంగరాజన్ ఇంట్లో ఉన్న సమయంలో కొందరు వ్యక్తులు దౌర్జన్యంగా లోపలికి ప్రవేశించారు. రామరాజ్య స్థాపనకు మద్దతు ఇవ్వాలని బెదిరించారు. అందుకు రంగరాజన్ నిరాకరించడంతో వారు ఆయనపై దాడికి పాల్పడ్డారు. తండ్రిపై జరుగుతున్న దాడిని అడ్డుకునేందుకు వచ్చిన రంగరాజన్ కుమారుడ్ని కూడా దుండగులు గాయపరిచారు. ఈ దాడిపై రంగరాజన్, చిలుకూరు ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడ్డ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దాడిని పలు హిందూ సంఘాలు ఖండించాయి. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.


Latest News
 

డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా జరిగిన సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం మద్దతు తెలిపిందన్న కేకే Sun, Mar 23, 2025, 08:52 PM
రేషన్ కార్డు దారులకు 6 కేజీల సన్నబియ్యం: ఉత్తమ్ Sun, Mar 23, 2025, 08:11 PM
రైతులకు స్పింక్లర్లను అందజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్ Sun, Mar 23, 2025, 08:07 PM
ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ విజేత వేములవాడ Sun, Mar 23, 2025, 07:49 PM
కామారెడ్డి సీనియర్ రొటోరియన్లకు అవార్డుల ప్రధానం Sun, Mar 23, 2025, 07:47 PM