![]() |
![]() |
byసూర్య | Sat, Feb 08, 2025, 07:48 PM
ఢిల్లీ ఎన్నికల్లో భాజపా మెజార్టీ స్థానాలు సాధించడంతో భువనగిరి పట్టణంలో బీజేపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. స్థానిక వినాయక చౌరస్తాలో టపాసులు కాల్చి మిఠాయిలను పంపిణీ చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్ మాట్లాడుతూ.. ఆప్ అవినీతి ప్రభుత్వానికి దిల్లీ ప్రజలు సరైన గుణపాఠం చెప్పారన్నారు. దేశ రాజధాని ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై మరోసారి విశ్వాసాన్ని వ్యక్తం చేశారన్నారు. ఈ విజయంతో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని.. భాజాపాకు ఏ పార్టీ కూడా సాటిరాదని వివరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మాయ దశరథ, చందా మహేందర్ గుప్తా, నర్ల నర్సింగరావు, కోళ్ల బిక్షపతి, రత్నపురం శ్రీశైలం, రాళ్ల బండి కృష్ణమాచారి తదితరులు పాల్గొన్నారు.