రోడ్డుపై బైఠాయించి ఆందోళన ..

byసూర్య | Mon, Jan 20, 2025, 12:52 PM

నాగర్‌కర్నూల్‌ జిల్లా బల్మూర్‌ మండలం మైలారంలో స్థానికులు ఆందోళనకు దిగారు. ‘మైనింగ్ వద్దు.. గుట్ట ముద్దు’ అనే నినాదంతో రైతులు నేటి నుంచి రిలే నిరాహార దీక్షలకు సిద్ధమయ్యారు. దీంతో ముందస్తుగా పలువురు రైతులు, స్థానికులను పోలీసులు అరెస్ట్‌ చేసి పీఎస్‌కు తరలించారు. తమ గ్రామానికి చెందిన రైతులను అక్రమంగా అరెస్ట్‌ చేశారని.. వారిని వెంటనే విడుదల చేయాలని స్థానికులు డిమాండ్‌ చేశారు. పెద్ద ఎత్తున మహిళలు, రైతులు రోడ్డుపైకి చేరి నిరసనకు దిగారు. అరెస్ట్‌ చేసిన వారిని విడుదల చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. పురుగుల మందు డబ్బాతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.    మరోవైపు మైలారంలో స్థానికులకు మద్దతు తెలిపేందుకు పౌరహక్కుల నేతలు ప్రొఫెసర్‌ హరగోపాల్‌, గడ్డం లక్ష్మణ్‌ హైదరాబాద్‌ నుంచి బయల్దేరి వచ్చారు. వారిని వెల్దండ వద్ద పోలీసులు అరెస్ట్‌ చేసి పీఎస్‌కు తరలించారు. 


 


 


Latest News
 

హరీశ్ రావు సవాల్: జూబ్లీహిల్స్ ఓటర్లు తేల్చండి – లేడీనా, రౌడీనా? Sat, Nov 08, 2025, 11:45 PM
బండి సంజయ్ సంచలనం: మాగంటి గోపీనాథ్ మరణం మిస్టరీ, ఆస్తులు కొట్టేందుకు కుట్రల ఆరోపణలు Sat, Nov 08, 2025, 11:36 PM
KTR సిగ్నల్: 14 తర్వాత రాష్ట్రంలో ఎవరు దూకుడుగా ఉంటారో గమనిస్తాం!” Sat, Nov 08, 2025, 11:17 PM
“జూబ్లీహిల్స్ రాజకీయ రణభూమి: టీడీపీ-బీజేపీ గ్యాప్ పెరుగుతోంది” Sat, Nov 08, 2025, 10:47 PM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. ఎక్కడికక్కడ తనిఖీలు.. భారీగా నగదు, లిక్కర్ సీజ్ Sat, Nov 08, 2025, 10:16 PM