తెలంగాణ సచివాలయంలో రేపటి నుంచి ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానాన్ని అమలు చేయనున్నారు.

byసూర్య | Wed, Dec 11, 2024, 10:01 PM

తెలంగాణ సచివాలయంలో రేపటి నుంచి ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానాన్ని అమలు చేయనున్నారు. డిసెంబరు 12వ తేదీ నుంచి రాష్ట్ర సచివాలయంలో ఈ నిబంధన అమలు చేయనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. స‌చివాల‌యంలో ప‌ని చేసే అన్ని శాఖ‌ల అధికారులు, సిబ్బందికి ఈ ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానం వర్తిస్తుందని ఆ ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. ఔట్ సోర్సింగ్, స‌చివాల‌యం హెడ్ నుంచి వేత‌నాలు పొందే ప్ర‌తి ఉద్యోగికి వర్తిస్తుందని స్పష్టం చేశారు. 


Latest News
 

హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత Fri, Jan 17, 2025, 04:19 PM
ఘనంగా శ్రీ కృష్ణదేవరాయల జయంతి Fri, Jan 17, 2025, 04:15 PM
సర్వే తీరును పరిశీలించిన ఆర్డీవో Fri, Jan 17, 2025, 04:14 PM
ఏసీబీకి చిక్కిన అవినీతి ఆర్ఐ Fri, Jan 17, 2025, 04:13 PM
పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు Fri, Jan 17, 2025, 04:11 PM