హైదరాబాద్ మెహిదీపట్నం స్కైవాక్‌.. డిజైన్ విషయంలో హెచ్ఎండీఏ కీలక నిర్ణయం

byసూర్య | Wed, Dec 11, 2024, 08:28 PM

హైదరాబాద్ నగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోంది. అందుకు అనుగుణంగా ప్రభుత్వం నగరంలో మౌళిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తోంది. నగరవాసులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ట్రాఫిక్ ఒకటి. దీంతో నగరంలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు గాను.. నగరంలో కొత్తగా ఫ్లైఓవర్లు, అండర్‌పాసులు, స్కైవాక్‌లు నిర్మిస్తున్నారు. ముంబయి హైవేలో అత్యంత కీలకమైన మెహదీపట్నం రైతుబజార్‌ జంక్షన్‌లో ట్రాఫిక్‌ సమస్యకు చెక్‌ పెట్టేందుకు స్కైవాక్‌ నిర్మిస్తున్నారు. అయితే ఈ స్కైవాక్ డిజైన్లలో హెచ్‌ఎండీఏ కీలక మార్పులు చేసింది.


ముందుగా ప్రణాళికలో అనుకున్నట్లుగా 21 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో చేపట్టాల్సిన కమర్షియల్ ప్రాంత అభివృద్ధిని తొలగించింది. ప్రస్తుతం రద్దీగా ఉన్న రోడ్డు దాటేందుకు మాత్రమే హెచ్‌ఏండీఏ అధికారులు స్కైవాక్‌ నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. మెహిదీపట్నం బస్‌స్టాప్‌తో పాటు రైతుబజార్‌ ప్రాంతం ప్రతి నిత్యం రద్దీగా ఉంటుంది. దీన్ని నివారించేందుకు గతంలో హెచ్‌ఎండీఏ ఇక్కడ స్కైవాక్‌ ప్రతిపాదనలు చేసిన విషయం తెలిసిందే. స్కైవాక్‌లో ఎలివేటర్లు, రెండు ఇంటర్మీడియట్‌ టన్నెల్‌ వాక్‌లు నిర్మించనున్నారు.


రైతుబజార్, బస్‌బే ఏరియా, డిఫెన్స్‌ కాంపౌండ్‌ వాల్, ఆసిఫ్‌నగర్‌ ఠాణా, రేమండ్‌ షోరూం (గుడిమల్కాపూర్‌ జంక్షన్‌) వద్ద ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలను ఏర్పాటు చేసేందుకు హెచ్‌ఎండీఏ అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ స్కైవాక్‌లోనే రైతుబజార్‌ ఆవరణలో 21,061.42 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎలివేటెడ్‌ కమర్షియల్ స్పేస్ నిర్మాణానికి సైతం సిద్ధమయ్యారు. డిఫెన్స్ నుంచి అడ్డంకులు ఇతరత్రా కారణాలతో పాత డిజైన్‌లో హెచ్‌ఎండీఏ మార్పులు చేసింది. అయితే కమర్షియల్ స్పేస్ అభివృద్ధిని మాత్రం పక్కనపెట్టింది.


కాగా, డిఫెన్స్ భూకేటాయింపుల జాప్యంతో కొన్నాళ్లపాటు స్కైవాక్‌ నిర్మాణ పనులు ఆగిపోయాయి. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రత్యేక చొరవతో డిఫెన్స్ శాఖ నుంచి భూ బదలాయింపు పూర్తి చేశారు. దీంతో పనుల్లో వేగం పెరిగింది. మరో నెల రోజుల వ్యవధి అంటే.. జనవరి నెలాఖరుకు స్కైవాక్‌‌ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా చూస్తామని హెచ్‌ఏండీఏ అధికారులు వెల్లడించారు.



Latest News
 

పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు Fri, Jan 17, 2025, 04:11 PM
రాష్ట్రంలోని 1.67 కోట్ల మంది ఆడబిడ్డలకు ప్రభుత్వం బాకీపడిందన్న కేటీఆర్ Fri, Jan 17, 2025, 03:45 PM
ఈ నెల 26 నుంచి రైతు భరోసా అమలవుతుందన్న జీవన్ రెడ్డి Fri, Jan 17, 2025, 03:44 PM
నల్గొండ జిల్లా కలెక్టర్‌ త్రిపాఠి సంచలన నిర్ణయం Fri, Jan 17, 2025, 03:19 PM
తెలంగాణలో ఉద్ధరించనోడు.. ఢిల్లీలో ఉద్ధరిస్తాడా? : కేటీఆర్ Fri, Jan 17, 2025, 03:12 PM