byసూర్య | Mon, Dec 02, 2024, 04:23 PM
జైలు నుంచి విడుదలయ్యాక కొన్నాళ్లు మౌనంగా ఉన్న బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత స్పీడు పెంచారు. బీఆర్ఎస్ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై చేసే కామెంట్లలోనూ పదును పెంచారు. తాజాగా.. ఆమె మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.తెలంగాణ జాగృతి ఉమ్మడి జిల్లా వారీగా డిసెంబర్ 4 నుంచి సమీక్ష సమావేశాలు నిర్వహించనుంది. జాగృతి అధ్యక్షురాలు, BRS ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అధ్యక్షతన వరుసగా సమావేశాలు జరుగనున్నాయి.
➣డిసెంబర్ 4: వరంగల్ & నిజామాబాద్
➣డిసెంబర్ 5: కరీంనగర్ & నల్గొండ
➣డిసెంబర్ 6: రంగారెడ్డి & ఆదిలాబాద్
➣డిసెంబర్ 7: హైదరాబాద్ & ఖమ్మం
➣డిసెంబర్ 8: మెదక్ & మహబూబ్నగర్