byసూర్య | Mon, Dec 02, 2024, 12:22 PM
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటాల్ ఏసీ మిర్చి ధర రూ. 16, 200 జెండా పాట పలుకగా, క్వింటాల్ కొత్త మిర్చి ధర రూ. 13, 051గా జెండా పాట పలికింది. అలాగే, క్వింటాల్ పత్తి ధర రూ. 7, 100 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటి కంటే ఈరోజు ఏసీ మిర్చి ధర రూ. 125, పత్తి ధర రూ. 100 తగ్గినట్లు వ్యాపారస్తులు తెలిపారు.