తెలంగాణ రైతులకు తీపి కబురు.. రేపు అకౌంట్లలో డబ్బులు జమ

byసూర్య | Sun, Dec 01, 2024, 10:29 PM

తెలంగాణ ప్రభుత్వం రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు విడతల్లో దాదాపు 18 వేల కోట్ల రూపాయలతో 22 లక్షల రైతు కుటుంబాలకు రుణమాఫీ వర్తింపజేశారు. అయితే ఆధార్, రేషన్ కార్డు, బ్యాంకు ఖాతాల్లో తప్పుల కారణంగా అర్హతలు ఉన్నా పలువురు రైతులకు రుణమాఫీ వర్తించలేదు. దీంతో ఆ రైతులకు కూడా తాజాగా ప్రభుత్వం రుణమాఫీ నిధులు విడుదల చేసింది.


  ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలలో భాగంగా శనివారం (నవంబర్ 30) మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్‌లో నిర్వహించిన రైతు పండుగ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ నిధులు విడుదల చేశారు. 3,13,897 మంది రైతు కుటుంబాలకు రుణ మాఫీ చేస్తూ అందుకు అవసరమైన 2747.67 కోట్లను విడుదల చేశారు. శనివారం సాయంత్రం నిధులు విడుదల చేయగా.. నేడు ఆదివారం బ్యాంకులకు సెలవు కావటంతో రేపు (డిసెంబర్ 2) రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి.


కాగా, తాజాగా విడుదల చేసిన నిధులతో రాష్ట్రంలో మొత్తంగా 25 లక్షల మంది రైతులకు 21 వేల కోట్ల రూపాయల మేరకు రుణమాఫీ జరిగిందని సీఎం రేవంత్ తెలిపారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 25 లక్షల మంది రైతు కుటుంబాలకు 21 వేల కోట్ల రూపాయల మేరకు రుణమాఫీ చేసిన చరిత్ర దేశంలోనే ఏదైనా రాష్ట్రం ఉందంటే అది తెలంగాణ ప్రజా ప్రభుత్వం మాత్రమేనని అని అన్నారు.


ప్రజా ప్రభుత్వానికి ఇకనుంచి రైతులే బ్రాండ్ అంబాసిడర్లు అని అన్నారు. కాళేశ్వరం నుంచి చుక్క నీరు పారనప్పటికీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు చరిత్రలో ఎప్పుడూ లేనంతగా, ఏ రాష్ట్రం ఉత్పత్తి చేయనంతగా 66 లక్షల ఎకరాల్లో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండించి రికార్డు సృష్టించాం అని గుర్తు చేశారు.


రైతే రాజు అని ప్రభుత్వం రైతన్నలకు రుణమాఫీ చేయడంతో పాటు వరి వేస్తే ఉరి వేసుకున్నట్టే అన్న పరిస్థితుల నుంచి రికార్డు స్థాయిలో ఉత్పత్తి సాధించడమే కాకుండా ప్రభుత్వం 500 రూపాయల బోనస్ ఇచ్చిన సందర్భంలో రైతు పండుగ చేసుకుంటున్నామన్నారు. గ్రీన్ చానెల్లో నిధులు విడుదల చేయించి ఉమ్మడి పాలమూరు జిల్లాలో 20 లక్షల ఎకరాలకు నీళ్లు పారించే బాధ్యత తీసుకుంటానని ఈ సందర్భంగా సీఎం వెల్లడించారు.



Latest News
 

హైదరాబాద్‌లో కూకట్‌పల్లిలో విపరీత అగ్ని: ఎందుకంటే ఇంకా తెలియనిది Tue, Jan 13, 2026, 11:30 PM
రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్.. "డైవర్షన్ పాలిటిక్స్ కోసమే సిట్‌లు, విచారణలు" Tue, Jan 13, 2026, 10:40 PM
పాతబస్తీలో భారీగా విద్యుత్ చోరీ.. ఏడాదికి రూ.600 కోట్ల నష్టం? ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన ట్వీట్! Tue, Jan 13, 2026, 10:37 PM
శ్రేయస్సును ఇచ్చే సంక్రాంతి.. రంగారెడ్డి జిల్లా ప్రజలకు చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి పండగ శుభాకాంక్షలు Tue, Jan 13, 2026, 10:33 PM
హత్యకారిణిగా మారుతున్న చైనా మాంజా: సీరియస్ అయిన మానవ హక్కుల కమిషన్ Tue, Jan 13, 2026, 10:32 PM